పీవీ ఎక్స్ప్రెస్వేపై స్కార్పియో బోల్తా
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని పీవీ ఎక్స్ప్రెస్ వే పైన బుధవారం చోటుచేసుకుంది. పిల్లర్ నెంబర్ 219 వద్ద స్కార్పియో వాహనం బోల్తా కొట్టింది. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. అందులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.