ఢిల్లీ విధానం అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ

ఢిల్లీ విధానం అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ


న్యూఢిల్లీ: ఢిల్లీ తరహా మల్టీ మోడల్ ట్రాన్సిట్ విధానాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. ఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ప్రజా రవాణా వాహనాల్లో ట్రాకింగ్ విధానం, జీపీఎస్ ఏర్పాటుపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.



రవాణా శాఖ సెక్రటరీ ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు, మరో ఏడుగురు అధికారులు సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, ఆర్టీసీ ఎండీ, ఇతర అధికారులను సభ్యులుగా నియమించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top