పాఠశాలలోనే ప్రసవించిన విద్యార్థిని


హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రసవించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలోని రెండవ అంతస్తులోని  బాత్రూమ్లో శనివారం ఆ విద్యార్థిని ...పాపకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన ఉపాధ్యాయులు బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.


 


అయితే తమ బిడ్డ గర్భవతి అనే విషయమే తెలియదని విద్యార్థిని తండ్రి వాపోతున్నాడు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని అతడు తెలిపాడు. బాధితురాలు చంద్రానాయక్ తండా వాసి.  కాగా పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top