ఇంకా వీడని రోహిత్ కిడ్నాప్ మిస్టరీ
హైదరాబాద్ : హైదరాబాద్ కుషాయిగూడలో కిడ్నాప్ అయిన రోహిత్ మిస్టరీ ఇంకా వీడలేదు. 36 గంటలు అయినా రోహిత్ ఆచూకీ లభించకపోవటంతో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కాగా కిడ్నాపర్లు...రోహిత్ను విడుదల చేయాలంటూ రూ. పది లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కాగా రోహిత్ ఏఎస్ రావు నగర్ లోని ఓ ప్రైవేటు స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కిడ్నాపర్లు అపహరించుకు వెళ్లారు. మరోవైపు మీడియాతో మాట్లాడటానికి ఇటు పోలీసులు.. అటు విద్యార్ధి తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. తమ కుమారుడు ఎలా ఉన్నాడో తెలియక వారు కన్నీరుమున్నీరవుతున్నారు.