88 ఏళ్ల రికార్డు బ్రేక్

88 ఏళ్ల రికార్డు బ్రేక్ - Sakshi


♦ 1927 సెప్టెంబరు 15న 36.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు

♦ ఆ తరవాత గురువారమే (సెప్టెంబరు 3న) 36.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు

 

 సాక్షి, హైదరాబాద్ : ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 88 ఏళ్ల తరవాత రాజధానిలో వర్షాకాలంలోనూ రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం గరిష్టంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. గతంలో 1927 సెప్టెంబరు 15న 36.1 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరవాత ఇప్పుడే ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వర్షాభావం, పొడి వాతావరణ పరిస్థితుల వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ కేంద్రం డెరైక్టర్ వెకై రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మరో 48 గంటల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top