‘టాప్ టెన్’లో ఐదుగురు తెలుగువారే!
-
లోక్సభ మెజారిటీ రికార్డుల్లో హవా -
జాబితాలో పీవీ, జగన్, వైఎస్, కేసీఆర్ -
తాజాగా ఏడో స్థానంలో పసునూరి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధిక మెజారిటీ సాధించిన వారిలో తాజా వరంగల్ ఉప ఎన్నిక విజయంతో పసునూరి దయాకర్ ఏడో స్థానంలో నిలిచారు. 1952లో జరిగిన లోక్సభ తొలి ఎన్నికల నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా టాప్ టెన్ అత్యధిక మెజారిటీ జాబితాలో ఏకంగా ఐదుగురు తెలుగువారే ఉండటం విశేషం.
వారు... దివంగత ప్రధాని పీవీ నరసింహారావు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, దయాకర్. బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండే కూతురు ప్రీతమ్ ముండే 2014 ఎన్నికల్లో ఏకంగా 6.92 లక్షల మెజారిటీతో ప్రథమ స్థానంలో ఉన్నారు.
సంబంధిత వార్తలు