పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
సికింద్రాబాద్ : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సికింద్రాబాద్ క్లాక్టవర్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తున్నవారిపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.