జల్సాలకు అలవాటుపడి..


హైదరాబాద్‌: జల్సాలకు అలవాటు పడి పార్కింగ్ చేసిన ఖరీదైన ద్విచక్ర వాహనాలను అపహరించి తక్కువ మొత్తంలో విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలకు చేస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమరు రూ. 8 లక్షల విలువైన 11 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఓ ఎస్సై వాహనం కూడా ఉండటం గమనార్హం. అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా.. ఓ కారు డ్రైవర్‌ ఉన్నాడు. వీరిని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సైదాబాద్‌ పోలీసులు తెలిపారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top