సంపులో పడి బాలుడు మృతి
హైదరాబాద్: ఎల్బీ నగర్ గుంటి జంగయ్య నగర్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నల్లగొండకు చెందిన దంపతులు తమ కుమారుడు వర్షిత్(3)తో పాటు నెల కింద కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. సోమవారం ఉదయం నల్లా నీరు రావటంతో ఇంట్లో ఉన్న సంపు మూతను తెరిచి ఉంచారు.
అప్పటి దాకా వర్షిత్కు అన్నం తినిపించిన బాలుని తల్లి.. ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి కనిపించలేదు. అటూఇటూ వెదికి చివరికి సంపులో చూడగా విగతజీవుడిగా కనిపించాడు. దీంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.