ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం


హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి ఓ ప్రయాణికుడు బుధవారం నగరానికి చేరుకున్నాడు. అతడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అతడి లగేజీలో భారీగా బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో  ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top