ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి ఓ ప్రయాణికుడు బుధవారం నగరానికి చేరుకున్నాడు. అతడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అతడి లగేజీలో భారీగా బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.