కల్తీ రక్తం కేసులో ముగ్గురు అరెస్ట్‌


హైదరాబాద్: కల్తీ రక్తం సరఫరా చేసిన కేసులో ఎల్‌బీ నగర్‌ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఎల్బీ నగర్ లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరసింహారెడ్డికి రక్తం ఎక్కించాల్సి రావడంతో బ్లడ్‌ బ్యాంకు నుంచి రక్తాన్ని సరఫరా చేశారు. అయితే అందులో కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో మలక్‌పేట్ వీనస్ ఆస్పత్రి డైరెక్టర్ చక్రవర్తితో పాటు బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జి శ్రావణ్‌, టెక్నీషియన్ ప్రేమ్‌కుమార్‌ను ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో రక్తంలో సెలైన్ కలుపుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ రక్తాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు ఎల్బీ నగర్ డీసీపీ వెంకటేశ్వర్ రావు తెలిపారు.

 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top