రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్: టాటా ఏస్ వాహనం బైక్ను ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన ఈసీఐఎల్ సమీపంలోని నోమా ఫంక్షన్ హాల్ వద్ద మంగళవారం మధ్యాహ్నాం చోటుచేసుకుంది. మల్లాపూర్కు చెందిన అభిషేక్ ఠాకూర్((19) అనే యువకుడు మరో యువకుడితో కలిసి ఈసీఐఎల్ నుంచి మల్లాపూర్కు బైక్పై వెళ్తుండగా వెనక నుంచి టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన అభిషేక్ అక్కడికక్కడే మృతిచెందగా..మరో యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.