ఔటర్‌పై కారు బోల్తా: ఇద్దరు మృతి


మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్ రింగ్ ఎగ్జిట్ 14 రోడ్డుపై కారు బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. శంషాబాద్ నుండి పెద్ద అంబర్‌పేట్‌ వెళ్తున్న ఏపీ 16బీబీ 3888 నంబరు గల కారుఅదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో అరుణ్ కుమార్, సాయి మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతులు విజయవాడకు చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాదంలో కారు నుజునుజ్జు అయింది.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top