టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రెండంతస్తుల భవనం పై నుంచి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన నగరంలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ప్రేమ్నగర్లో నివాసముంటున్న సింధూజ(15) రిషి హై స్కూల్లో పదో తరగతి చదువుతోంది.
ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు పరీక్షలకోసం సిద్ధమైన విద్యార్థిని కుటుంబ సభ్యులు నిద్రించిన అనంతరం భవనం పై నుంచి కిందకు దూకింది. వెంటనే ఆమెను అంబులెన్స్ సాయంతో ఓమిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.