తుళ్లూరులో కొనసాగుతున్న వైఎస్ జగన్ పర్యటన


తుళ్లూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం ఆయన ఉద్దండరాయునిపాలెంలో వైఎస్సార్‌సీపీ నేత నందిగం సురేష్ మేనల్లుడు చలివేంద్ర నాగేంద్రబాబు వివాహానికి, అనంతరం వడ్డమాను గ్రామంలో పార్టీనేత గొట్టం శివారెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ తరువాత ప్రకాశం జిల్లా సంతమాగులూరులోని పార్టీ నాయకుడు ఆట్ల చిన వెంకట రెడ్డి కుమారుడు కోటిరెడ్డి వివాహానికి హాజరవుతారు.

 



 

Read also in:
Back to Top