రోడ్డు ప్రమాదంలో డీసీసీ అధ్యక్షుడి కుమారుడు మృతి


హైదరాబాద్ : నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కుమారుడు విశాల్ రెడ్డి మృతి చెందాడు. క్రాస్ రోడ్స్ వద్ద ఉదయం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న విశాల్ రెడ్డి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. విశాల్ రెడ్డి నగరంలోని కేఎమ్ఐటీ లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. విశాల్ మరణ వార్త తెలిసి రాజేందర్ రెడ్డి ఘటనా స్థలికి బయలుదేరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 



 

Read also in:
Back to Top