విద్యార్థి అనుమానాస్పద మృతి


కర్నూలు సమీపంలోని రైలు ట్రాక్ పై సూర్యసాయిహరిరావు(22) అనే డిగ్రీ విద్యార్థి ఆదివారం ఉదయం అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తల ఒక చోట, మొండెం ఒక చోట పడి ఉండడంతో పోలీసులు అనుమానాస్పగద మృతిగా పరిగణిస్తున్నారు. మృతుడు తాడేపల్లిగూడెంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీఎస్సీ ఎంపీఐసీ గ్రూపు ఫైనలియర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలియదు. ఎవరో అతణ్ణి చంపి తల ఒకచోట, మొండెం ఒక చోట పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసి నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.



 




 

Read also in:
Back to Top