ఎర్రవల్లిలో అప్పులబాధతో రైతు ఆత్మహత్య
వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తూముకుంట రామచంద్రయ్య(42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక పొలంలో ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేసిన పంట ఎండిపోవడం, చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోవడమే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. సుమారు రూ.5 లక్షల మేర అప్పులపాలైనట్లు తెలియజేశారు.