జమ్మూకశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం


జమ్మూకశ్మీర్లో బుధవారం భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఉదయం ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు తాంఘ్దార్ సెక్టార్ సమీపంలోని ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకొని కాల్పులు ప్రారంభించారు. ఊహించని దాడితో ఉలిక్కిపడిన భారత ఆర్మీ ఒక్కసారిగా ప్రతి దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.


ఈ ఘటనలో భారత ఆర్మీకి చెందిన ఆయిల్ డిపో మంటల్లో చిక్కుకుంది. ఉగ్రవాదులు దాడికి దిగిన విధానాన్ని బట్టి భారీ విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ పౌరుడు కూడా మృతి చెందినట్లు సమాచారం.

 




 

Read also in:
Back to Top