టీవీ ఆన్ చేస్తూ.. విద్యార్థి మృతి


టీవీ ఆన్ చేయడానికి ప్రయత్నించిన బాలుడు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా తోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అచ్యుత్(12) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కావడంతో.. ఇంట్లో టీవీ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో స్టప్‌లైజర్‌కు విద్యుత్ షాక్ రావడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు.



గ్రామంలో ఉదయం నుంచి పలువురికి విద్యుత్ షాక్ కొట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఆరుగురికి కరెంట్ షాక్ కొట్టడంతో అప్రమత్తమైన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపి వేసి మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు.




 

Read also in:
Back to Top