తిరుచానూరు ఆలయంలో సామూహిక వ్రతాలు


తిరుచానూరు: చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వ్రతాలకు ఏర్పాట్లు చేశారు. ఆస్తాన మండపంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ వ్రతాలు జరగనున్నాయి.



అమ్మవారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి అర్చకులు వ్రతాలు నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరిగింది. అభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.




 

Read also in:
Back to Top