ఉగ్రదాడిపై ప్రముఖుల మండిపాటు


న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఉగ్రదాడి ఘటనను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, స్థానికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

ఖండించిన చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్: దాడిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు జనాన్ని చంపడాన్ని ఆయన  ఖండించారు.

 

పిరికిపందల చర్య: వైస్ జగన్

ఈ దాడి పిరికి పందల చర్య అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పలువురు భద్రతా సిబ్బంది,  పౌరులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

 




 

Read also in:
Back to Top