శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు


తిరుమల: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో చత్తీస్‌గడ్ సీఎం రమణ్‌సింగ్, అండమాన్ నికోబార్ గవర్నర్ ఏకే సింగ్, గాయని పి.సుశీల, సినీ నటి కవితతో పాటు పలువురు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో వీరు స్వామిని దర్శించుకున్నారు. అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.






 

Read also in:
Back to Top