బీజేపీని వీడేది లేదు: శత్రుఘ్న సిన్హా

బీజేపీని వీడేది లేదు: శత్రుఘ్న సిన్హా - Sakshi


పట్నా: బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో వీడేది లేదని ఆ పార్టీ ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. శనివారం బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో శత్రుఘ్న భేటీ నేపథ్యంలో ఆయన పార్టీ వీడతారనే ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఆదివారం ఈ విషయంపై సిన్హా స్పందించారు. ‘ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు బీజేపీలో చేరాను.. క్లిష్ట సమయాల్లోనూ పార్టీలోనే ఉన్నాను. జేడీయూలో చేరే ప్రశ్నే లేదు’ అని పేర్కొన్నారు. ‘భవిష్యత్తును ఎవరు చెప్పగలరు. రేపు ఎవరైనా నన్నే పార్టీ నుంచి గెంటేయవచ్చు..



దాని గురించిన ఆలోచనే నాకు లేదు’ అని అన్నారు.  నితీశ్‌తో సమావేశంపై మాట్లాడుతూ... ఆయనతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, పట్నా వచ్చిన ప్రతిసారీ ఆయనను కలుస్తానని తెలిపారు.

 




 

Read also in:
Back to Top