ఆర్టీసీ డిపోలో బస్సు దగ్ధం


ఆదిలాబాద్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపోలో నిలిపిన బస్సులో హఠాత్తుగా మంటలు రేగి బస్సుమొత్తం కాలిపోయింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన సూపర్‌లగ్జరీ బస్సు(ఏపీ 29 జడ్ 2561) వాటర్ వాషింగ్ కోసం ఆగి ఉండగా బస్సులోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.


చూస్తుండగానే బస్సు కాలిపోయింది. ఆర్టీసీ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి కబురు చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను దుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో దాదాపు 10 లక్షల రూపాయల ఆస్థినష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నారు.



 

whatsapp channel




 

Read also in:
Back to Top