ఆర్టీసీ బస్సు ప్రమాదం: నలుగురికి గాయాలు


వైఎస్సార్ జిల్లా  ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం పెన్నానది బ్రిడ్జి సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో గంగాధరం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 




 

Read also in:
Back to Top