5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం


అక్రమంగా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్‌కడప జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లిలో బుధవారం ఉదయం అటవీ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. వాగేటికోన నుంచి వస్తున్న కంటైనర్‌ను గుర్తించారు.


వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా.. అందులో ఉన్న డ్రైవర్ సహా మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో కంటైనర్ తెరిచి చూసిన అధికారులకు భారీ ఎర్రచందనం దుంగలు దర్శనమిచ్చాయి. 6 టన్నుల బరువున్న 200 దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి విలువ సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 




 

Read also in:
Back to Top