'హోదాపై రాద్ధాంతం ఎందుకు'

'హోదాపై రాద్ధాంతం ఎందుకు' - Sakshi


పాలకొల్లు: ఏపీ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ భారీగా నిధులు విడుదల చేస్తుంటే ప్రత్యేక హోదా కోసం రాద్ధాంతం ఎందుకని బేజేపీ నేత దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరానికి శుక్రవారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కేంద్రం నిధులు విడుదల చేస్తుందని, ప్రత్యేక హోదాపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అయితే మేము హోదాకు వ్యతిరేకం కాదని, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తమ అభిప్రాయమన్నారు.

 




 

Read also in:
Back to Top