ఈ పోరాటం ఇంతటితో ఆగదు..

ఈ పోరాటం ఇంతటితో ఆగదు.. - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం, ఏపీ ప్రభుత్వాల తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం విజయవంతమైదని, బంద్ ను విజయవంతం చేసిన అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.



హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బంద్ ను విఫలం చేయడానికి చంద్రబాబు సర్కార్ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు వాటిని తిప్పికొట్టారన్నారు. బాబు ఆదేశాలతో పోలీసులు ఎన్ని అవాంతరాలు సృష్టించినా బంద్ విజయవంతమైందన్నారు. వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటం రాష్ట్రాభివృద్ధి కోసమేనన్న ఆయన.. పోరాటం ఇంతటితో ఆగదని, ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేవరకు కొట్లాడతామన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడాలని సూచించారు.




 

Read also in:
Back to Top