ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే

ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే - Sakshi


బంద్‌ను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు

కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


 

 వేముల :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు వద్ద శనివారం చేపట్టిన బంద్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉద్యోగాలు, పరిశ్రమలు కావాలంటే ప్రత్యేక హోదా అవసరమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాపై డిమాండు బలంగా ఉందనే విషయం తెలిసేలా యురేనియం ప్రాజెక్టు వద్ద బంద్ పాటించామన్నారు. బంద్‌తో ప్రాజెక్టులో పనులు స్తంభించిపోయాయన్నారు.



జిల్లాలో బంద్ విజయవంతమవడానికి స్వచ్ఛందంగా షాపులను మూసివేసి సహకరించిన వ్యాపార వర్గాలు, పాఠశాలల యాజమాన్యాలు, కార్మికులు, వివిధ పార్టీల నేతలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మరకా శివకృష్ణారెడ్డి పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top