విద్యుత్ షాక్‌తో తల్లీ కూతురు మృతి


ప్రకాశం(కొత్తపట్నం):కరెంట్ షాక్ తో తల్లీ కూతురు మృతి చెందారు. ఈ ఘటన గురువారం ఉదమం వెలుగులోకి వచ్చింది. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన సరోజనమ్మ(65) కూతురు తిరుమల(36)తో కలసి ఉంటుంది. అయితే బుధవారం రాత్రి మోటురు వేసేందుకు వెళ్లిన తిరుమలకు విద్యుత్ షాక్ తగిలింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన సరోజనమ్మకు కూడా షాక్ తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.




 

Read also in:
Back to Top