ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. మెదక్ జిల్లా సిద్దిపేటలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న సిద్దిపేటకు చెందిన వైష్ణవి(18), వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన సాయి ప్రేమించుకుంటున్నారు. అయితే, గురువారం మధ్యాహ్నం వారు సిరిసిల్ల శివారులో యాసిడ్ తాగి పడి ఉండగా స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.