తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గురువారం రాత్రి శ్రీవారి సర్వదర్శనానికి ఏడు గంటల సమయం పట్టింది.
ప్రవేశద్వారా దర్శనానికి రెండు గంటలు సమయం పట్టగా, అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన వచ్చిన భక్తులకు దర్శనం కోసం నాలుగు గంటలు పట్టింది.