చదవలేకపోతున్నా..అందుకే


అనంతపురం(హిందూపురం): చదువు ఇష్టం లేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం చోటుచేసుకుంది. హిందూపురంలోని ముదిరెడ్డి పల్లికి చెందిన నిఖిల(18) అనే యువతి స్థానిక ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది. అయితే చదవలేకపోతున్నా అని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సుసైడ్ నోట్ రాసి గురువారం ఉదయం ఉరివేసుకుంది. కాగా, పది రోజుల కిందట ఇదే కళాశాలలో మరో విద్యార్థి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 




 

Read also in:
Back to Top