రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో కోదండరాం పిటిషన్


రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున పిటిషన్ వేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ విధానాలు రైతులను ఆత్మహత్యలకు ప్రోత్సహించేలా ఉందని ఆరోపించారు. ప్రభుత్వం స్వామినాథన్ రిపోర్టును పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కాగా.. ఇంప్లీడ్ పిటిషన్ పై రేపు విచారణ జరగ నుంది.

 




 

Read also in:
Back to Top