రైతు ఆత్మహత్యలపై విచారణ వాయిదా


హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో రైతు ఆత్మహత్యలపై దాఖలైన వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు విచారణ జరిగింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి భట్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇరు ప్రభుత్వాల తీరుపై తీవ్రంగా స్పందించింది. రైతు ఆత్మహత్యలపై ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై స్పందించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు రైతుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ]

 

అయితే సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి..కానీ అవి సరిపోవని హైకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా అధికారుల అవినీతి కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోందని, అలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 3 రోజుల్లోగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ అంశాలన్నింటిపై కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. 

 



 

Read also in:
Back to Top