గన్నవరం-కాశి మధ్య విమాన సర్వీసు


విజయవాడ: గన్నవరం- కాశీ(వారణాసి) మధ్య ఆదివారం నుంచి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. గన్నవరం నుంచి మధ్యాహ్నం 2.40కి బయలుదేరి సాయంత్రం 6.50కి వారణాసికి విమానం చేరుకోనుంది. అలాగే మర్నాడు ఉదయం 10 గంటలకు వారణాసిలో బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. మొత్తం 189మంది పట్టే భారీ బోయింగ్ విమానాన్ని గన్నవరం-కాశీ మధ్య నడపనున్నారు.



 

Read also in:
Back to Top