ట్రాన్స్‌‘ఫార్మర్’పైనే.. ప్రాణాలు విడిచాడు..

ట్రాన్స్‌‘ఫార్మర్’పైనే.. ప్రాణాలు విడిచాడు.. - Sakshi


ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫ్యూజ్ వేయబోయి ఓ రైతు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన రైతు సరసం సుధాకర్‌రెడ్డి(52) మంగళవారం పొలంలో వరినాట్లు వేయించాడు. నీరు పెడదామని  బుధవారం మోటార్ ఆన్‌చేయగా కరెం టు లేదు. సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించగా ఫ్యూజ్ ఊడిపోయినట్లు గుర్తిం చాడు. దీంతో ఫ్యూజ్ వేద్దామని ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేశాడు. కానీ సరిగా ఆఫ్‌కాలేదు. అది గమనించని సుధాకర్‌రెడ్డి ఫ్యూజ్ వేస్తుం డగా.. విద్యుదాఘాతంతో అదే ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి ప్రాణాలు వదిలాడు.      -భూదాన్ పోచంపల్లి




 

Read also in:
Back to Top