ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

కిటికీల్లోంచి బయటకు వస్తున్న రోగులు - Sakshi

ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ ప్రభుత్వాసుపత్రిలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని మందుల విభాగంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయభ్రాంతులకు లోనయ్యారు. పలువురు ఆసుపత్రి కిటికీ అద్దాలను పగులగొట్టి బయటపడ్డారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 



 

Read also in:
Back to Top