ప్రశాంత్నగర్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: కూకట్పల్లి పరిధిలోని ప్రశాంతినగర్లో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎంతనష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది.