తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 59,062 మంది భక్తులు దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు.



 

Read also in:
Back to Top