తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం స్వామి దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. కాగా ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 44,182 మంది భక్తులు దర్శించుకున్నారు.



 

Read also in:
Back to Top