తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 3గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమలలో 220 గదులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సోమవారం తిరుమల శ్రీవారిని 75,235 మంది భక్తులు దర్శించుకున్నారు.




 

Read also in:
Back to Top