గాంధీ భవన్లో వైఎస్ఆర్కు ఘన నివాళి
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్లో నేతలు బుధవారం ఘనంగా నివాళి అర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి..వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మండలి విపక్ష నేత షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్యే డీకే అరుణ, మాజీ మంత్రి, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు దానం నాగేందర్, మాజీ మంత్రి శ్రీధర్బాబు, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, పీసీసీ ముఖ్యనాయకులు పలువురు పాల్గొని నివాళులు అర్పించారు.