బాబు దిష్టిబొమ్మ దహనం


పిడుగురాళ్ల మండలం బుచ్చిగొండ గ్రామం వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ నాయకులు దహనం చేశారు. దళితులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


మాచర్ల-హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో సుమారు 4 కి.మీ ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అటుగా వస్తున్న నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఈ విషయం గురించి వినతిపత్రం అందజేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.



 




 

Read also in:
Back to Top