భద్రాద్రి హుండీ ఆదాయం రూ. 2.10 కోట్లు


భద్రాచలం: గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయానికి హుండీల ద్వారా  రూ. 2,10,02,537 ఆదాయం వచ్చింది. మంగళ, బుధవారాల్లో ఆలయ హుండీల లెక్కింపును చేపట్టగా, 188 గ్రాముల  బంగారం,  2,268 గ్రాముల వెండి వచ్చినట్లుగా దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి వెల్లడించారు. భద్రాద్రి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న పర్ణశాల హుండీల లెక్కింపు గురువారం చేపట్టనున్నారు. గోదావరి పుష్కరాల కోసం వరంగల్ జిల్లా మేడారం దేవస్థానం నుంచి ప్రత్యేకంగా 70 హుండీలను తెప్పించారు.




 

Read also in:
Back to Top