వర్షప్రభావిత జిల్లాల్లో కాంగ్రెస్ నేతల పర్యటన


హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలకి నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న మూడు జిల్లాల్లో వీరి పర్యటన కొనసాగనుంది. ఈ నెల  27న వైఎస్ఆర్ జిల్లా, 28న చిత్తూర్, 29న నెల్లూరు జిల్లాల్లో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో పర్యటన సాగనుంది. ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్యతోపాటూ మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ పర్యటనలో పాల్గోనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, ఆస్తులు నష్టపోయిన వారి వివరాలు తెలుసుకోనున్నారు.

 




 

Read also in:
Back to Top