ప్రజా వ్యతిరే క విధానాలపై పోరాడాలి
* వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీ ప్రకటన
హైదరాబాద్: రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొనేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరారు. అందుకు గాను 11 మంది సభ్యులతో ఒక కమిటీ ప్రకటిస్తున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆమోదంతో కమిటీ సభ్యులుగా కె. శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, జి. సురేశ్రెడ్డి, మతిన్ బై, ఆదం విజయకుమార్, బొడ్డు సాయినాథ్ రెడ్డి, సత్యం శ్రీరంగం, హెచ్ఏ రెహ్మాన్, ముజ్తబ అహ్మద్లను నియమించినట్లు చెప్పారు. ఈ ఎన్నికల కమిటీ సభ్యులు జీహెచ్ఎంసీ పరిధిలో వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షులను నియమిస్తారన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తారని చెప్పారు.