83 మంది వాహనదారులకు జరిమానాలు


హైదరాబాద్: నగరంలోని కాచిగూడ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 83 మంది వాహనదారులకు జరిమానా విధించారు.



ట్రాఫిక్ ఏసీపీ డాక్టర్ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో బుధవారం బర్కత్‌పుర చమన్, టూరిస్ట్ హోటల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, ఇలా నిబంధనలను ఉల్లంఘించిన 83 మంది మంది వాహదారులపై కేసులు నమోదు చేసినట్లు కాచిగూడ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పీజీ రెడ్డి తెలిపారు.




 

Read also in:
Back to Top